పేలిన మొబైల్ ఆన్లైన్ చదువుల్లో అపశ్రుతి
భువనేశ్వర్/పూరీ: కరోనా మహమ్మారి తాండవంతో పిల్లలకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక దశ నుంచి ఉన్నత స్థాయి వరకు నిరవధికంగా పాఠ్యాంశాల బోధన కొనసాగిస్తున్నారు. అయితే ఆన్లైన్ తరగతులకు హాజరైన ఓ చిన్నారి మొబైల్ పేలడంతో ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడింది. పూరీ పట్టణంలోని బల్లిఘాయి ఆదర్శ నగర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ విషాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థినిని కేంద్రియ విద్యాలయంలో 7వ తరగతి చదువుతున్న రుప్సా పొలైగా గుర్తించారు