
కారుణ్య నియామకాలకు కౌన్సెలింగ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు పొందుతున్న వారు సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమవేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో విధి నిర్వహణలో ఉంటూ మృతి చెందిన వారి కుటుంబ వారసులకు కారుణ్య నియామకాల కౌన్సెలింగ్ చేపట్టారు. 42 మంది అభ్యర్థులు హాజరుకాగా రోస్టర్, రిజర్వేషన్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని 32 మందికి నియామక పత్రాలు అందజేశారు. వీరిలో 24 మంది టైపిస్టులు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు ఆఫీస్ సబార్టినేట్లు ఉన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ ఎం.వి.సూర్యనారాయణ, డీటీ ఢిల్లేశ్వరరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.