
ఆన్లైన్ గేమ్స్లో నష్టపోయి వ్యక్తి ఆత్మహత్య
హిరమండలం: గులుమూరు గ్రామానికి చెందిన మజ్జి బుజ్జి (40)గడ్డిమందు తాగి బుధవారం మృతిచెందాడు. హిరమండలం ఎస్సై ఎండీ యాసీన్ తెలిపిన వివరాల ప్రకారం.. బుజ్జి హిరమండలంలోని టాటా ప్లాంట్లో సూపర్వైజర్గా పని చేస్తుండేవాడు. ఆన్లైన్ గేమ్స్లో నష్టపోయి అప్పుల పాలయ్యాడు. మానసిక ఒత్తిడికి గురై మనస్థాపం చెంది మంగళవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. భార్య భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు.