వైద్య శిబిరం ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

వైద్య శిబిరం ఏర్పాటు

Jul 17 2025 3:44 AM | Updated on Jul 17 2025 3:44 AM

వైద్య శిబిరం ఏర్పాటు

వైద్య శిబిరం ఏర్పాటు

టెక్కలి రూరల్‌: గూడెం పంచాయతీ సన్యాసి నీలాపురంలో బుధవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ‘నీలాపురంలో జ్వరాలు’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన వైద్య సిబ్బంది గ్రామానికి వెళ్లి బావులు, రోడ్డుకు ఇరువైపులా క్లోరినేషన్‌ చేయించారు. లింగాలవలస పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ పవన్‌తేజ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. రక్తపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

కంప్యూటర్‌ అకౌంటెన్సీ కోర్సులో శిక్షణ

రణస్థలం: ఎచ్చెర్ల మండల కేంద్రంలోని యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న కంప్యూటర్‌ అకౌంటెన్సీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్‌ ఎన్‌.రామ్‌జీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పదో తరగతి చదివిన, 19 నుంచి 45 ఏళ్ల బీపీఎల్‌ కేటగిరి మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 38 రోజులపాటు నిర్వహించే ఈ శిక్షణలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామని, పూర్తి వివరాలకు 77021 80537 నంబరును సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement