రైతులను దగా చేస్తున్న కూటమి
వైఎస్సార్ సీపీ హయాంలో నేను చేసిన విజ్ఞప్తి మేరకు పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులను కృష్ణా జలాలతో నింపేందుకు 3 టీఎంసీలు కేటాయిస్తూ వైఎస్ జగన్ జీఓ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా... 193 చెరువులు దేవుడెరుగు బుక్కపట్నం చెరువును కూడా నింపడం లేదు.
కేవలం కుప్పానికి నీరు తీసుకుపోవాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఈ ప్రాంత రైతులను దగా చేస్తున్నారు. ఇక నియోజకవర్గానికి కేటాయించిన 3 టీఎంసీల గురించి మాట్లాడే వారే కరువయ్యారు.
– దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే


