మహిళలపై గొడ్డలితో దాడి | - | Sakshi
Sakshi News home page

మహిళలపై గొడ్డలితో దాడి

Nov 30 2025 6:50 AM | Updated on Nov 30 2025 6:50 AM

మహిళలపై గొడ్డలితో దాడి

మహిళలపై గొడ్డలితో దాడి

ఉదయగిరి: ఇద్దరు మహిళలపై గొడ్డలితో వ్యక్తి దాడి చేసిన ఘటన మండలంలోని పుల్లాయపల్లి ఎస్సీ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కట్టెల కోసం సమీపంలోని అడవికి ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మీనరసమ్మ, కవిత వెళ్లారు. ఈ క్రమంలో కవితకు వరుసకు బావ.. లక్ష్మీనరసమ్మ భర్తకు మరిదైన ఆదినారాయణ తారసపడ్డారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ఆదినారాయణ తన వద్ద ఉన్న గొడ్డలితో వీరిపై దాడి చేశారు. కాగా వ్యసనాలకు బానిసై కాలనీలో చిన్న దొంగతనాలకు పాల్పడుతుండటంతో గతంలో వీరిద్దరూ మందలించారనే విషయాన్ని మనస్సులో పెట్టుకొని దాడికి పాల్పడ్డారని కాలనీ వాసులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన మహిళలను ఉదయగిరి సీహెచ్‌సీకి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వైద్యశాలకు ఎస్సై ఇంద్రసేనారెడ్డి చేరుకొని దాడి ఘటనపై వివరాలను సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement