మన్నేరు వాగులో పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

మన్నేరు వాగులో పడి వ్యక్తి మృతి

Nov 28 2025 7:16 AM | Updated on Nov 28 2025 7:16 AM

మన్నేరు వాగులో పడి వ్యక్తి మృతి

మన్నేరు వాగులో పడి వ్యక్తి మృతి

ఉలవపాడు: ప్రమాదవశాత్తు మన్నేరు వాగులో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని మన్నేటికోట సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మన్నేటికోట గ్రామానికి చెందిన బక్కా ప్రభుదాస్‌ (48) మూడు రోజుల నుంచి కనిపించడం లేదు. ఈ విషయాన్ని స్థానికులు హైదరాబాద్‌లో ఉంటున్న అతని కుమారుడు కోటయ్యకు తెలిపారు. గురువారం అతను వచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు, కోటయ్య కలిసి గ్రామం, పరిసర ప్రాంతాల్లో విచారించగా మన్నేరు వాగు సమీపంలో ప్రభుదాస్‌ తిరిగినట్లుగా తెలిసింది. మృతదేహం వాగులో కనిపించింది. ఈ విషయం రెవెన్యూ అధికారులకు కూడా తెలియజేసి పోలీ సులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉలవపాడు సీహెచ్‌సీ వైద్యశాలకు తరలించారు. కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement