
బాధితులకు అండగా వైఎస్సార్సీపీ
గుడ్లూరు: వైఎస్సార్సీపీలో పనిచేసిన కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. మండలంలోని బసిరెడ్డిపాళెం పంచాయతీ చెంచిరెడ్డిపాళేనికి చెందిన నరాల శ్రీనివాసులురెడ్డి పార్టీలో రైతు విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో పార్టీ శ్రేణులు బుర్రా దృష్టికి తీసుకువెళ్లాయి. ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి శ్రీనివాసులురెడ్డి విషయం చెప్పారు. వెంటనే జగన్ బాధిత కుటుంబానికి రూ.లక్ష అందించాలని బుర్రాను ఆదేశించారు. మరో రూ.లక్షను కలిపి మొత్తం రూ.2 లక్షలను బాధిత కుటుంబానికి అందించారు. దీంతో కుటుంబ సభ్యులు మాజీ సీఎం జగన్, బుర్రాకు కృతజ్ఞతలు తెలిపారు.