అబద్ధపు ప్రచారాలు సిగ్గుచేటు
● సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్
నెల్లూరు(స్టోన్హౌస్పేట): కోవూరు, ఆత్మకూరు ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, మేకపాటి విక్రమ్రెడ్డి టీడీపీలోకి వెళ్తున్నారని అబద్ధపు ప్రచారాలు చేయడం సిగ్గు చేటని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరులో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మంత్రి పదవి రాకపోతే పార్టీలు మారతారా?.. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని, ప్రజల్లో అపోహలు కల్పించే మాటలు ఇప్పటికైనా మానుకోవాలన్నారు. ఏదో మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలవగానే టీడీపీకి ఊపు వచ్చేసినట్లు ప్రచారాలు చేస్తున్నారన్నారు. వారు సంబర పడడం చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఉందన్నారు.