IPL 2022: సీఎస్కే వర్సెస్ గుజరాత్ టైటాన్స్.. విజయం ఎవరిది..?
ఐపీఎల్-2022లో మరో ఉత్కంఠ భరిత పోరుకు రంగం సిద్దమైంది. ఏప్రిల్ 17వ తేదీన పూణెలోని ఎంసీఏ స్టేడియంలో జరిగే డబుల్ హెడ్ర్ రెండో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ తొలి స్థానంలో ఉంది. గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తన ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టును విజయ బాటలో నడిపిస్తున్నాడు.
ఇక చెన్నైసూపర్ కింగ్స్ విషయానికి వస్తే.. ఈ సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించి సీఎస్కే బోణి కొట్టింది. కాగా బ్యాటింగ్ పరంగా సీఎస్కే పటిష్టంగా కన్పిస్తున్నప్పటికీ.. బౌలింగ్లో మాత్రం అంతగా రాణించలేక పోతుంది. ఇక ఈ మ్యాచ్లో ముఖేష్ చౌదరి స్థానంలో తుషార్ దేశ్సాండే సీఎస్కే తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
పిచ్ రిపోర్ట్
ఎంసీఏ స్టేడియంలో జరిగిన గత మ్యాచ్లో బ్యాటర్లకు పిచ్ అనుకూలించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ఆ తర్వాత వచ్చే మంచు కారణంగా ముందుగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది.
తుది జట్లు అంచనా
గుజరాత్ టైటాన్స్
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్
చెన్నై సూపర్ కింగ్స్
రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంస్ ధోని, డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే
చదవండి: IPL 2022: ఔటైన కోపంలో ఇషాన్ కిషన్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్
సంబంధిత వార్తలు