Sri Lanka Tour: కెప్టెన్సీ రేసులో ధావన్‌, హార్దిక్‌!

Shikhar Dhawan Hardik Pandya In Race For Captaincy In Sri Lanka Tour - Sakshi

శ్రీలంకతో సిరీస్‌కు కెప్టెన్సీపై చర్చ

ముంబై: దాదాపు ద్వితీయ శ్రేణి జట్టుతో జూలై లో భారత్‌... శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో లంకతో భారత్‌ 3 వన్డేలు, 3 టి20 లు ఆడుతుంది. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్‌ ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది.  సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాలలో ఒకరు కెపె్టన్‌గా ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. గత ఎనిమిదేళ్లుగా భారత పరిమిత ఓవర్ల జట్టులో ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఉన్న ధావన్‌ వరుసగా రెండు ఐపీఎల్‌లలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

అతనికి కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది. అయితే కొత్తదనం కోసం హార్దిక్‌ను కూడా ప్రయతి్నంచే అవకాశం ఉందని బీసీసీఐ సీనియర్‌ సభ్యుడొకరు అభిప్రాయపడ్డారు. ‘హార్దిక్‌కు ఒంటి చేత్తో మ్యాచ్‌ను మార్చగల సత్తా ఉంది. ఇలాంటి ఆటగాడికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే అతని ఆట మరింతగా మెరుగు పడవచ్చు. లంకలాంటి సిరీస్‌కు ఇలాంటి ప్రయోగాలు చేస్తే మంచిదే కదా’ అని ఆయన అన్నారు.

చదవండి: WTC Final తర్వాత ఆటకు గుడ్‌బై

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top