IND vs WI: వెస్టిండీస్‌తో మూడో వ‌న్డే.. యంగ్ ఓపెన‌ర్‌ వ‌చ్చేశాడు!

Ruturaj Gaikwad recovers from COVID 19 - Sakshi

భార‌త అభిమానుల‌కు గుడ్ న్యూస్‌. టీమిండియా యువ ఓపెన‌ర్ రుత్‌రాజ్‌ గైక్వాడ్ క‌రోనా నుంచి కోలుకున్నాడు. గురువారం చేసిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో రుత్‌రాజ్‌కు నెగెటివ్‌గా నిర్ధార‌ణైంది. దీంతో ఐసోలేషన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప్రాక్టీస్ మొద‌లు పెట్టాడు. ఇక వెస్టిండీస్‌తో జ‌రిగే మూడో వ‌న్డే తుది జ‌ట్టులో రుత్‌రాజ్‌కు చోటు ద‌క్కే అవ‌కాశం ఉంది. కాగా వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రుత్‌రాజ్ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.

ఆదే విధంగా వెస్టిండీస్‌తో జ‌రిగే టీ20 సిరీస్‌కు ప్ర‌క‌టించిన భార‌త జ‌ట్టులో రుత్‌రాజ్‌ భాగ‌మై ఉన్నాడు. కాగా గైక్వాడ్ గత ఏడాది శ్రీలంకపై టీ20ల్లో భార‌త త‌రుపున అరంగేట్రం చేశాడు. గత నెలలో దక్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌కు రుత్‌రాజ్‌కు చోటు ద‌క్కుతుంది అంతా భావించిన‌ప్ప‌టికీ సెలక్టెర్లు మ‌రోసారి మెండిచేయి చూపించారు. గ‌త ఏడాది విజ‌య హాజ‌రే ట్రోఫీ, స‌య్య‌ద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో రుత్‌రాజ్‌ గైక్వాడ్ అద్భుతంగా రాణించాడు. ఇక భార‌త్‌- వెస్టిండీస్ మ‌ధ్య మూడో వ‌న్డే అహ్మ‌దాబాద్ వేదిక‌గా శుక్ర‌వారం జ‌ర‌గ‌నుంది.

 చ‌ద‌వండి: IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలం.. పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top