IPL 2022- KKR: కేకేఆర్‌ తయ్యార్‌.. శ్రేయస్‌ జట్టు కొత్త జెర్సీ ఎలా ఉందో చూశారా?

IPL 2022: Kolkata Knight Riders Unveiled Their Jersey Watch - Sakshi

IPL 2022- Kolkata Knight Riders: ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. జట్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెంకీ మైసూర్‌, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించింది. ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియా వేదికగా వీడియో షేర్‌ చేసి అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కాగా బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌, నటి జూహీ చావ్లా ఆధ్వ్యంలోని కేకేఆర్‌ కొత్త జెర్సీ గోల్డ్‌, పర్పుల్‌ కలర్ల మేళవింపుతో రూపుదిద్దుకుంది. ఇక ఐపీఎల్‌-2021 రన్నరప్‌గా నిలిచిన కేకేఆర్‌ ఈసారి కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనుంది. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను ఐపీఎల్‌-2022 మెగా వేలంలో భాగంగా 12.25 కోట్లకు కోల్‌కతా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అతడిని తమ సారథిగా నియమించింది.

ఇక జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో కేకేఆర్‌ ఎండీ వెంకీ మైసూర్‌ మాట్లాడుతూ.. శ్రేయస్‌ కెప్టెన్సీపై తమకు నమ్మకం ఉందన్నాడు. ఆటలో గెలుపోటములు సహజమని, తమ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతీ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు.

చదవండి: IPL 2022: కప్‌ గెలుస్తారో లేదో తెలీదు.. మా మనసులు దోచుకున్నారు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top