రెండో టి20: ఓపెనర్‌గా రిషభ్‌ పంత్‌?

India vs New Zealand 1st T20 Match On 20 Nov 2022 - Sakshi

మధ్యాహ్నం గం. 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రత్యక్ష ప్రసారం  

మౌంట్‌ మాంగనుయ్‌: తొలి టి20 మ్యాచ్‌ వర్షార్పణం కావడంతో... సిరీస్‌లో తొలి విజయమే లక్ష్యంగా నేడు జరిగే రెండో టి20 మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో నిష్క్రమించాక భారత్‌ ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే కావడంతో యువ ఆటగాళ్లపై అందరి దృష్టి ఉంది. హార్దిక్‌ పాండ్యా నాయకత్వంలో బరిలోకి దిగనున్న భారత్‌ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందో చూడాలి.

శుబ్‌మన్‌ గిల్‌కు జతగా ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ లేదా రిషభ్‌ పంత్‌లలో ఒకరు వచ్చే అవకాశముంది. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ రాణిస్తే భారత్‌ భారీ స్కోరు చేసే అవకాశముంటుంది. బౌలర్లలో భువనేశ్వర్‌తోపాటు అర్‌‡్షదీప్, హర్షల్‌ పటేల్‌ బరిలోకి దిగడం ఖాయం. మరోవైపు ఓపెనర్లు కాన్వే, అలెన్‌ శుభారంభం అందిస్తే... విలియమ్సన్, ఫిలిప్స్, మిచెల్‌ మెరుపులతో న్యూజిలాండ్‌ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే చాన్స్‌ ఉంటుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top