వైరల్: కూతురితో కలిసి రహానే స్టెప్పులు
చెన్నై: భారత్, ఇంగ్లండ్ మధ్య మరో వారం రోజుల్లో చెన్నై వేదికగా టెస్టు సిరీస్ ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఇప్పటికే చెన్నై చేరుకున్నాయి. కరోనా కారణంగా భారత ఆటగాళ్లు స్థానిక హోటల్లో ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్కు ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను తీసుకొచ్చేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. దీంతో కొంతమంది టీమిండియా క్రికెటర్లు తమ భార్య, పిల్లలతో ఇక్కడికి వచ్చారు. అందరూ క్వారంటైన్లో ఉండ్సాలి రావడంతో ఫ్యామిలీతోనే సరదాగా గడుపుతున్నారు. చదవండి: ధోని తరహాలో.. చివరి బంతికి సిక్స్ కొట్టి
ఈ నేపథ్యంలోనే వైస్ కెప్టెన్ అజింక్య రహానే హోటల్ రూమ్లో తన కూతురుతో కలిసి డ్యాన్స్ చేశాడు. తొలి రోజు సరదాగా గడిచిందంటూ రహానే సతీమణి రాధిక ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేసింది. 'క్వారంటైన్ మొదటి రోజు వినోదం' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. వీడియోలో కుమార్తెతో కలిసి రహానే స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు ఫిబ్రవరి 5వ తేదీన చెన్నై వేదికగా జరగనుంది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు