Hardik Pandya :'నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు.. నేనేంటో నిరూపించుకుంటా'
ఐపీఎల్లో కొత్త జట్టుగా అవతరించిన అహ్మదాబాద్ కెప్టెన్గా భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపికైన సంగతి తెలిసిందే. రాబోయే సీజన్ కోసం 15 కోట్లకు అహ్మదాబాద్తో హార్దిక్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా కెప్టెన్గా ఎంపికైన తర్వాత తొలి సారిగా హార్దిక్ స్పందించాడు. ఐపీఎల్లో అహ్మదాబాద్తో తన కొత్త ప్రయాణాన్నిప్రారంభించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు హార్దిక్ తెలిపాడు. కాగా 2015లో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరుపున హార్దిక్ పాండ్యా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు ముంబై ఇండియన్స్ పాండ్యాని రీటైన్ చేసుకోలేదు.
“హలో అహ్మదాబాద్. ఐపీఎల్లో కొత్త జట్టు అహ్మదాబాద్తో ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకం ఉంచి కెప్టెన్గా ఎంపిక చేసినందుకు యాజమాన్యానికి, మేనేజ్మెంట్కు ధన్యవాదాలు. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాను" అని ట్విటర్లో హార్దిక్ పేర్కొన్నాడు. అదే విధంగా హార్దిక్ పాండ్యాతో పాటు రషీద్ ఖాన్, గిల్ని అహ్మదాబాద్ సొంతం చేసుకుంది.
చదవండి: SA vs IND: 'భారత్ గెలవాలంటే అతడు జట్టులోకి రావాలి'
మరిన్ని వార్తలు