ఢిల్లీ వర్సెస్‌ ముంబై: హోరాహోరీగా సాగేనా?

Delhi Won The Toss And Elected To Bat First - Sakshi

అబుదాబి: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ముందుగా బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించగా, ముంబై ఇండియన్స్‌ ఆరు మ్యాచ్‌లకు గాను నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ముంబై ఇండియన్స్‌ హ్యాట్రిక్‌ విజయాలతో రేసులోకి రాగా, ఢిల్లీకి కూడా వరుసగా మూడు విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఇరుజట్ల మధ్య 24 మ్యాచ్‌లు జరగ్గా అందులో తలో 12 విజయాలు సాధించాయి. ఈ జట్ల మధ్య పోరు ఎప్పుడు జరిగినా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు జట్లు మంచి ఫామ్‌లో ఉండటంతో మరొకసారి హోరాహోరీ తప్పకపోవచ్చు. 

బుమ్రా వర్సెస్‌ పృథ్వీషా
ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా- పృథ్వీ షాల ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. తాజా ఐపీఎల్‌లో బుమ్రా 11 వికెట్లు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. బుమ్రా యావరేజ్‌ 17.81 ఉండగా, స్టైక్‌రేట్‌ 13.09 గా ఉంది. ఇక పృథ్వీ షా విషయానికొస్తే ఆరు మ్యాచ్‌ల్లో 198 పరుగులు సాధించాడు. ఇక్కడ పృథ్వీ షా యవరేజ్‌ 33గా ఉండగా, స్టైక్‌రేట్‌ 151.14గా ఉంది. ఢిల్లీకి మంచి ఆరంభాన్ని పృథ్వీ షా ఇస్తుండగా, ముంబై బౌలింగ్‌లో బుమ్రా కీలకంగా మారాడు. దాంతో ఇరువురి మధ్య పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top