న్యూస్రీల్
ప్రతిభకు పురస్కారం
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ విద్యార్థులు సత్తా చాటారు. మల్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఆకుల వర్షిత 594 మార్కులతో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలల ఫలితాలకు సంబంధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆకుల వర్షితకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా రూ.లక్ష నగదు పురస్కారంతోపాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు. –కొండాపూర్(సంగారెడ్డి)


