లోకేష్‌ వ్యాఖ్యలు దుర్మార్గం: ఎంపీ అవినాష్‌రెడ్డి

YS Avinash Reddy Fires On Nara Lokesh About Visakha Steel Plant - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో లోకేష్‌ వ్యాఖ్యలు దుర్మార్గమని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ''కోతి చేతికి రాయి ఇస్తే ఎలా ఉంటుందో.. లోకేష్‌ తీరు అలానే ఉంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నానని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు సంబంధించి ఏ కమిటీలోనూ సభ్యుడిగా లేను. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు రాష్ట్రప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఇప్పటికే ఈ విషయంపై సీఎం జగన్‌ కేంద్రానికి లేఖ రాశారని'' తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top