హామీల అమలులో కేసీఆర్‌ విఫలం: షర్మిల

Telangana: YSRTP YS Sharmila Criticized On CM KCR - Sakshi

హుజూర్‌నగర్‌ రూరల్‌: గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయ డంలో సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యా రని వైఎస్సార్‌ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. ఆమె చేపట్టిన ప్రజాప్ర స్థానం పాదయాత్ర సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలం లింగగిరి, కాచవారిగూడెం, గోపాలపురం గ్రామాల్లో కొ నసాగింది.

గోపాలపురంలో ఆమె మాట్లా డుతూ.. టీఆర్‌ఎస్‌ ఎనిమిదేళ్ల పాలనలో రైతు లకు రుణమాఫీ, వ్యవసాయ రుణాల మంజూరు, విద్య, ఉద్యోగ రంగాల సమస్యలేవీ పరిష్కరించలేదని విమర్శించారు. అర్హులకు పింఛన్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకుండా ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారన్నారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి అధికార మిస్తే తన తండ్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తానన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top