ముఖ్యమంత్రి కేసీఆర్ది ద్వంద్వ వైఖరి: బండి
కరీంనగర్ టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని అగ్రిమెంట్ రాసి ఇచ్చి, ఇప్పుడు బాయిల్డ్ రైస్ తీసుకోవాలని గ్రామాల నుండి తీర్మానాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన బీజేపీ నాయకులపై ప్రభుత్వం పెట్టిన కేసులో బుధవారం కరీంనగర్ జైలు నుంచి 23 మంది విడుదలయ్యారు. వారికి ఆయన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... బియ్యం కొంటామని కేంద్రం అంటే, ఇవ్వబోమని చెప్పింది సీఎం కేసీఆరేనని మండిపడ్డారు.