చంద్రబాబు తోకలు పచ్చ పత్రికలు: సోము
పెదవాల్తేరు (విశాఖతూర్పు): చంద్రబాబును ఎవరు ఏమన్నా రాష్ట్రంలోని కొన్ని పచ్చ పత్రికలు ఊరుకోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. కేంద్రం మంజూరు చేసిన పక్కా ఇళ్లు పూర్తిచేయకుండా చంద్రబాబు హయాంలో సగంలోనే వదిలేశారని గుర్తు చేశారు.
బీజేపీ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని కోరారు. నగరంలోని ఒక హోటల్లో దక్షిణ నియోజకవర్గ కార్యకర్తల రెండురోజుల శిక్షణ కార్యక్రమం ఆదివారం ముగిసింది. వీర్రాజు మాట్లాడుతూ బీజేపీని బూత్స్థాయి నుంచి పటిష్టం చేస్తామన్నారు. ఇందులో భాగంగా వార్డు స్థాయి, బూత్స్థాయి కమిటీలను త్వరలో నియమిస్తామని చెప్పారు.