నాపై విచారణ చేయాల్సిందిగా కలెక్టర్కు నేనే లేఖ రాశాను
సాక్షి, తాడేపల్లి: నా నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందంటూ చంద్రబాబు కేసులు వేయిస్తున్నారు. దళితుడనైన నాపై అదే దళితులతో హై కోర్ట్లో కేసు వేయించడం, విచారణ కోరడం జరిగింది అంటూ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన ఆరోపణలకు సంబంధించి నాపై విచారణ చేయాల్సిందిగా నేనే ఈ రోజు జిల్లా కలెక్టర్కి, ప్రభుత్వానికిలేఖ రాసాను. వారు ఆరోపిస్తున్న ప్రాంతంలో ఇసుక రవాణాపై సమగ్ర విచారణ జరపాలి. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఆ ఆరోపణలను నిరూపించాలి. ఒక్క ఇసుక రేణువు తీసుకెళ్లానని నిరూపించినా నేను రాజీనామాకు సిద్ధం. అమాయకులైన దళితులను అడ్డు పెట్టుకుని కుట్ర రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు’ అంటూ మండి పడ్డారు. (చదవండి: ‘అంటరానితనం చంద్రబాబు ఒంట్లో ఉంది’)