8న సెంచూరియన్లో ‘రైతు సమ్మేళనం’
నెల్లిమర్ల రూరల్: ఈ నెల 8న సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ‘రైతు సమ్మేళనం’ నిర్వహించనున్నట్లు వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డీఎన్ రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు, కలెక్టర్ రామ్ సుందర్ రెడ్ది పాల్గొంటున్నారని వివరించారు. ఈ సందర్భంగా రైతులకు సంబంధించి వ్యవసాయ సాంకేతిక ప్రదర్శనలు, శాస్త్రవేత్తలతో పరస్పర చర్చలు, ఉత్పత్తుల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.


