
సాగర్ను సందర్శించిన విదేశీయులు
విజయపురిసౌత్: పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థలో ఈ నెల 1వ తేదీ నుంచి 14 వరకు భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 24 దేశాలకు చెందిన 37మంది మంగళవారం నాగార్జునసాగర్ను సందర్శించారు. పర్యావరణ, అభివృద్ధి, నీటి సంరక్షణ తదితర అంశాలలో శిక్షణ పొందుతున్న వీరు సాగర్ జలాశయం, మెయిన్ డ్యాం, జల విద్యుదుత్పాదన కేంద్రం తదితర ప్రాంతాలను సందర్శించారు. సాగర్ ప్రాజెక్టు నిర్మాణం, జలవనరుల వినియోగం తదితర అంశాల గురించి సాగనీటి శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.