
అర్జీలను సత్వరం పరిష్కరించండి
నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో 198 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్ఓ ఏకా మురళి, డీఎఫ్ఓ కృష్ణప్రియ, ఆర్డీఓ కె.మధులత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పీజీఆర్ఎస్లో 198 అర్జీలు స్వీకరణ