జనాభా గణనకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

జనాభా గణనకు సన్నాహాలు

Nov 3 2025 6:24 AM | Updated on Nov 3 2025 6:24 AM

జనాభా గణనకు సన్నాహాలు

జనాభా గణనకు సన్నాహాలు

భువనేశ్వర్‌: త్వరలో ప్రారంభమవ్వనున్న జనాభా గణన – 2027 సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయి. ఈ చర్యల్లో భాగంగా రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ విభాగం అన్ని జిల్లా కలెక్టర్లు మరియు మున్సిపల్‌ కార్పొరేషన్ల కమిషనర్లను వారి జిల్లాలు మరియు కార్పొరేషన్ల పరిధిలో ప్రముఖ గణాంక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం అధికార పరిధిలో జనాభా గణన కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతను జనాభా గణన అధికారులకు కేటాయించారు. 1990 జనాభా గణన నియమ నిబంధనల ప్రకారం ఈ నియామకం చేసినట్లు పేర్కొన్నారు. జనాభా గణన ప్రక్రియ విజయవంతం కావడంలో అధికారులు కీలక పాత్ర పోషిస్తారు.

సురేష్‌ దాస్‌ మృతి తీరని లోటు

జయపురం: జయపురం సాహిత్య పరిషత్‌ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ సురేష్‌ దాస్‌ మృతి సాహిత్య రంగానికి తీరని లోటని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో సురేష్‌ దాస్‌ సంతాప సభను సాహిత్య పరిషత్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయపురం సాహిత్య పరిషత్‌ కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సాహిత్యకులు లక్ష్మీకాంత పాఢీ, శ్రీకాంత మిశ్ర, డాక్టర్‌ ప్రదీప్‌ మిశ్ర. నరసింగ పాణిగ్రహి, జి.బి.రావు, కృష్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు.

వ్యభిచార గృహంపై దాడి.. నలుగురు అరెస్టు

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సదరు పాత్రోగూడ గ్రామం వద్ద ఓ అద్దె ఇంటిలో వ్యభిచారం జరుగున్నట్లు మల్కన్‌గిరి ఎస్‌డిపీఓ దివ్య దళైకు సమాచారం రావడంతో ఐఐసీ రీగాన్‌కీండో తన సిబ్బందితో శనివారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఇద్దరు వేశ్యలు, ఇద్దరు కస్టమర్లు ఉన్నారు. మొత్తం నలుగురిని అరెస్టు చేసి మల్కన్‌గిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆదివారం వారిని విచారించగా ఓ మహిళ, మరో పురుషుడు దీని వెనుక ఉన్నట్లు తెలిసింది. వారిని కూడా ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. యువతులు జగత్‌సింగ్‌పూర్‌, భద్రక్‌ జిల్లాలకు చెందినవారు. కస్టమర్లు చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమాకు చెందిన వారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement