క్రైస్తవ దివంగతులకు శ్రద్ధాంజలి
భువనేశ్వర్: క్రైస్తవ కుటుంబీకులు దివంగతులకు సామూహికంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఖుర్దారోడ్ క్రైస్తవ స్మశాన వాటికలో ఆదివారం నిర్వహించిన అఖిల ఆత్మల దినం కార్యక్రమంలో భాగంగా కుటుంబీకులు అంతా చేరి సామూహిక శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి జట్నీ నియోజక వర్గం ఎమ్మెల్యే బిభూతి భూషణ్ బల్వంత్రాయ్, మున్సిపల్ మండలి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ డాక్టర్ సస్మిత్ పాత్రో మంజూరు చేసిన నిధులతో స్మశానవాటిక అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కొత్తగా నిర్మించిన ప్రవేశ మార్గాన్ని ఆరంభించారు.
క్రైస్తవ దివంగతులకు శ్రద్ధాంజలి


