హైదరాబాద్‌ యువకుడి దుర్మరణం 

USA: Hyderabad Man Died In Road Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. హైదరాబాద్‌ టప్పాచబూత్రాకు చెందిన మహమ్మద్‌ మొయిజుద్దీన్‌ (35) షికాగోలో శనివారం తెల్లవారుజామున 3.30కి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మొయిజుద్దీన్‌ 2015లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. ఒకవైపు విద్య అభ్యసిస్తూనే రాత్రిపూట పార్ట్‌టైంగా ఉబెర్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య, ఎనిమిది నెలల బాబు ఉన్నాడు. చదవండి : 12 నెలల్లో 900కి పైగా బలవన్మరణాలు

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top