కాంగ్రెస్ గూటికి ఏకగ్రీవ సర్పంచులు
● ఆహ్వానించిన శ్రీహరిరావు
నిర్మల్చైన్గేట్: సారంగాపూర్ మండలం స్వర్ణ(పొన్కుర్) గ్రామ సర్పంచ్గా కొత్తింటి మల్లేశ్, మామడ మండలం కప్పన్పల్లి సర్పంచ్గా చుంచు బాపు లింగన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీహరిరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి అభినందించారు. ఇందులో నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీమ్రెడ్డి, అబ్దుల్ హదిల్, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ రాజ్మొహమ్మద్, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, కొంకూరు స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.


