ఇ-సిగ్నేచర్...ఇక ఈజీ
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ ఐటీ చట్ట పరిధిని విస్తృతం చేస్తుంది. ఇది ఇ–సిగ్నేచర్ టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకోవడానికి వివిధ వ్యాపారాలకు అవకాశం ఇస్తుందని డిజిటల్ టెక్నాలజీ దిశగా అన్ని రకాల కార్యకలాపాలను నడిపిస్తుందని సిగ్నెట్ ఇన్ఫొటెక్ హెడ్ యోగేష్ లోఖాండే అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఇ- సిగ్నేచర్ అమలుకు సంబంధించి వచ్చిన ఆదేశాలపై ఆయన మాట్లాడుతూ... అత్యంత ముఖ్యమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్, అలాగే రియల్ ఎస్టేట్ రంగాలు సహా.. ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం డిజిటల్ టెక్నాలజీతో రూపాంతరం చెందుతోన్న పరిస్థితిలో ఇ- సిగ్నేచర్ ఆయా రంగాల్లోని కార్యకలాపాలను గణనీయంగా పెంచడంతో పాటు వేగవంతం చేస్తుందన్నారు. గతంలో ఎలక్ట్రానిక్ సంతకం అమలు చేయడం వీలుకాని బ్యాంకింగ్, బీమా, వంటి రంగాలపై ఇక దీని ప్రభావం బాగా ఉంటుంది. అంతిమంగా ఈ తరహా మార్పులు భారత ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి ఎంతగానో ఉపకరిస్తాయన్నారు.
సంబంధిత వార్తలు