Trending Top 10 News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1. World Earth Day 2022: వరల్డ్ ఎర్త్ డే..
పక్షులకు సేనాపతిపక్షుల కోసం ఒక సైన్యం ఉంటుందా? అదీ మహిళా సైన్యం. ఉంటుంది. అస్సాంలో ఉంది. అక్కడి అరుదైన కొంగలు అంతరించిపోతున్నాయని గ్రామాల్లో మహిళలతో సైన్యాన్ని తయారు చేసింది వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ పూర్ణిమ బర్మన్. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ ఎర్త్ డే సందర్భంగా ‘వన్ ఫర్ చేంజ్’ పేరుతో మన దేశంలో పర్యావరణ మార్పుకోసం విశేషంగా కృషి చేసిన పది మందిపై షార్ట్ ఫిల్మ్స్ ప్రసారం చేయనుంది.
2. పాక్ ఆర్మీ చీఫ్పై ఇమ్రాన్ ఆరోపణలు
పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఖమర్ జావెద్ బజ్వాపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరోక్ష విమర్శలు చేశారు. తన పదవి పోయేందుకు కీలక స్థానాల్లో ఉన్న కొందరు కారణమని దుయ్యబట్టారు. తన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ‘ప్రతి సంస్థలో మనుషులుంటారు.
3.. ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం
ఎండవేడిమి పెరిగిపోతోంది. ఏసీలు, ఫ్రిజ్ల వాడకం ఎక్కువైపోయింది. కరోనా అదుపులోనికి రావడంతో పరిశ్రమల్లో ఉత్పత్తి సాధారణ స్థితికి వచ్చింది. దీంతో విద్యుత్ వాడకం ఎక్కవైపోయింది. డిమాండ్కి తగ్గట్టుగా సప్లయ్ చేయడానికి థర్మల్ కేంద్రాలను బొగ్గు కొరత వేధిస్తోంది.
4.. హైదరాబాద్: మెట్రో ప్రయాణికులకు శుభవార్త..
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు మరో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇంటి నుంచి మెట్రో స్టేషన్కు, మెట్రో స్టేషన్ నుంచి ఇంటికి చేరుకునేందుకు మెట్రో రైడ్ పేరుతో ఈ– ఆటో సేవలు ప్రారంభమయ్యాయి.
5.. మంగంపేట బెరైటీస్ బంగారం.. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మంగంపేటలోని బెరైటీస్ ఖనిజానికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఈ ఖనిజం కోసం కొనుగోలుదారులు పోటీ పడుతున్నారు. బెరైటీస్ ఉత్పత్తి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) తాజాగా నిర్వహించిన ఈ–ఆక్షన్లో రికార్డు స్థాయి రేట్లు నమోదయ్యాయి.
6. Hero Yash Comments: 'కేజీయఫ్-2' విజయంపై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
'కేజీయఫ్-2' విజయంపై రాకింగ్ స్టార్ యశ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తమ చిత్రం పై ప్రేక్షకులు, అభిమానులు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకున్నాడు.
7. IPL 2022: ధోని ఫినిషింగ్ టచ్.. ముంబై ‘ఏడు’పు..!
56 పరుగులను అందుకునే క్రమంలో చెన్నై తడబాటు...మ్యాచ్లో మరో ఐదు బంతులు మిగిలి ఉండగా ముంబైకే గెలుపు అవకాశాలు...మ్యాచ్ గెలిచి లీగ్లో రోహిత్ సేన బోణీ కొట్టేలా కనిపించింది. 5 బంతుల్లో చెన్నై చేయాల్సినవి 17 పరుగులు... అప్పుడే క్రీజులోకి వచ్చిన బ్రేవో పరుగు తీసి ధోనికి స్ట్రయిక్ ఇచ్చాడు.
8.. అడగకుండా కార్డులు జారీ చేయొద్దు
కస్టమర్ల నుంచి విస్పష్టంగా సమ్మతి తీసుకోకుండా క్రెడిట్ కార్డులు ఇవ్వడం లేదా ప్రస్తుత కార్డును అప్గ్రేడ్ చేయడం వంటివి చేయొద్దని కార్డ్ కంపెనీలను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. దీన్ని ఉల్లంఘించిన పక్షంలో కస్టమర్కు వేసిన బిల్లుకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.
9.. ఏ.. నా కొడుకూ విన్పించుకోడు అన్న యువకుడు.. లాగిపెట్టి కొట్టిన ఎమ్మెల్యే
స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటరమణప్ప ఓ యువకున్ని చెంప దెబ్బ కొట్టడం దుమారం రేపింది. ఈ నెల 19 న ఎమ్మెల్యే తాలూకాఫీసులో ఓ సమావేశంలో పాల్గొని బయటికి వస్తుండగా నాగేనహళ్ళికి చెందిన నరేంద్ర అనే యువకుడు హుసేన్పురం, ర్యాపిట, నాగేనహళ్ళి గ్రామాలకు చెందిన రోడ్లను ఎప్పుడు వేస్తారని ఎమ్మెల్యే ని ప్రశ్నించాడు.
10.. పదో తరగతి విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ ఆదేశాలిచ్చింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వారి గ్రామం నుంచి పరీక్ష కేంద్రం వరకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని ఆయా జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు, జిల్లాల పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్లకు ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) ఆదేశాలిచ్చారు