గొంతులో ఏకే 47తో కాల్చుకుని జవాను ఆత్మహత్యాయత్నం 

Tamil Nadu CISF Jawan Try To End His Life With AK 47 Rifle - Sakshi

సాక్షి, చెన్నై : ఎన్నికల విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ జవాను ఏకే47తో గొంతులో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సేలంలో ఎన్నికల విధుల నిమిత్తం వంద మంది పారా మిలిటరీ, సీఐఎస్‌ఎఫ్‌ జవానులు అన్నదాన పట్టిలో బస చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయాన్నే ఓ గది నుంచి తుపాకీ పేలిన శబ్దం రావడంతో అక్కడున్న జవాన్లలో ఆందోళన మొదలైంది. వెంటనే అటు వైపుగా కొందరు పరుగులు తీశారు. అక్కడ ఓ జవాను గొంతులో ఏకే 47తో కాల్చుకుని పడి ఉండటంతో తక్షణం ఆస్పత్రికి తరలించారు. ఆ జవాను ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు. ఆ జవాను పేరు ఆశిష్‌ కుమార్‌(30) అని తెలిపారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ విభాగంలో ఆశిష్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. పని భారంతో ఆత్మహత్యాయత్నం చేశాడా..? లేదా, కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా..? అన్న కోణంలో అన్నదాన పట్టి పోలీసులు విచారిస్తున్నారు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top