గత 24 గంటల్లో 18,139 కరోనా కేసులు 

India Records 18,139 New Coronavirus Cases In Last 24 hrs - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది.  గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,139 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా 234 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,04,13,417కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా దేశంలో ఇప్పటివరకు 1,50,570 మంది మరణించినట్లు బులెటిన్‌ విడుదల చేసింది.  భారత్‌లో కరోనా కేసులు పెరిగినా రికవరీ రేటు కూడా అదే స్థాయిలో నమోదవుతుంది. గత 24 గంటల్లోనే 20,539మంది డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు  1,00,37,398 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,25,449 యాక్టివ్‌ కేసులున్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top