ఒక్కరోజులోనే 95,735 కరోనా‌ కేసులు

Highest Single Day Spike Of 95735 Cases Crosses 44 Lakh Corona Cases India - Sakshi

ఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 95,735 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,65,864కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ఈ విధంగా ఉంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 1,172 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 75,062కు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 9,19,018 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కరోనా నుంచి ఇప్పటివరకు 34,71,784 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా రోగుల రికవరీ రేటు 78.77 శాతంగా ఉండగా.. యాక్టివ్ కేసులు 20.67 శాతంగా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,29,756 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిపగా.. ఇప్పటివరకు మొత్తం 5,29,34,433 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top