ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో అత్యధిక కేసులు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 4715 కేసులు వెలుగు చూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 2,14,000కు చేరింది. ఢిల్లీలో 4000 పైగా కేసులు నమోదు కావడం ఇదో నాలుగోసారి. సెప్టెంబర్ 2నుంచి ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య వరుసగా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 60 వేల టెస్టులు చేశారు. ఇప్పటికి రాజధానిలో 1,81,295 మంది కోలుకున్నారు. గత పది రోజుల్లో మరణాల రేటు 0.68 శాతంగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో రికవరీ రెటు 84.68శాతంగా ఉంది. నగరంలో 1,383 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. (చదవండి: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరీక్షలు మళ్లీ షురూ!)