దేశంలో 98 లక్షలు దాటిన కరోనా కేసులు

Coronavirus Cases In India Crossed 98 Lakh Mark With 30005 new Cases - Sakshi

న్యూఢిల్లీ : దేశంలో గత  24 గంటల్లో 30,005 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,26,775కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా కొత్తగా 442 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,42,628కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కొత్తగా 33,494 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 93,24,328 కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 94.84 శాతానికి చేరింది. దేశంలో ప్రస్తుతం 3,59,819 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 3.71  శాతం ఉండగా.. మరణాల శాతం 1.45 శాతంగా ఉంది. (చదవండి : 7 కోట్లు దాటిన కరోనా కేసులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top