24 గంటల్లో 50,210 పాజిటివ్ కేసులు

సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 50,210 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 704 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 83,64,086 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల తీవ్రత పెరుగుతున్నా డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 55,331మంది డిశార్జ్ కాగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5,33,787 యాక్టీవ్ కేసులున్నాయి. ఇక మొత్తం ఇప్పటి వరకు 76,11,809 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ఇక కరోనా వైరస్ సోకి దేశంలో ఇప్పటి వరకు మొత్తం1,24,315మంది మృతి చెందారు. మరోవైపు కరోనా రికవరీ రేటు కూడా చాలా ఎక్కువగానే ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 92.20 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన కేసులలో మొత్తం యాక్టివ్ కేసులు కేవలం 6.318 శాతం మాత్రమే. ఈ మరణాల శాతం మొత్తం నమోదయిన కేసులలో 1.49 శాతంగా ఉన్నాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి