కరోనా: 1.45 శాతానికి తగ్గిన మరణాల రేటు
న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 32,080 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 97,35,850కి చేరింది. కొత్తగా కరోనాతో 402 మంది మృత్యువాతపడగా ఇప్పటి వరకు 1,41,360 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి బుధవారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం 3,78,909 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 36,635 మంది డిశ్చార్జి అవ్వగా.. మొత్తం 92,15,581 మంది కోలుకున్నారు. దేశంలో 94,66 శాతం రికవరీ రేటుఉంది. యాక్టివ్ కేసుల శాతం 3.89గా ఉంది. ఇక మరణాలు 1.45 శాతానికి తగ్గింది.