Lockdown: దోశ తినడానికి ఎన్ని తిప్పలో !
ఇంచుమించుగా దేశం మొత్తం లాక్డౌన్ గుప్పిట్లో ఉంది. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దాదాపు నెల రోజులగా ఇంటి పట్టునే ఉంటూ ...ఇంటి వంటలే తింటున్నారు. బయటకెళ్లి తిందామంటే బడ్డీ కొట్టు మొదలు బడా రెస్టారెంట్ వరకు అన్ని క్లోజ్. కానీ వెరైటీ ఫుడ్ తినాలనే కోరిక బలంగా ఉండాలనే కానీ ఏదో ఒక మార్గం దొరక్క మానదు. రెస్టారెంట్ క్లోజ్ అయినా సరే కారు డ్యాష్ బోర్డునే రెస్టారెంట్ టేబుల్గా మార్చుకుని ఇద్దరు ఇండియన్లు దోశెలను ఎంచక్కా లాగించేశారు. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయాంక షేర్ చేసి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదూ..
When restaurants are closed, dining-in Indian style! pic.twitter.com/LN47Bi63XK
— Harsh Goenka (@hvgoenka) May 24, 2021