వీడియో: అతిఖ్‌ సోదరుల హత్య.. ఇలా జరిగిందట..

Atiq Ahmad Case: Judicial Commission recreate the crime scene - Sakshi

లక్నో: పోలీసులు పక్కనే ఉన్నారు. కెమెరాలు ఆన్‌చేసుకుని మీడియా అక్కడే ఉంది. వాళ్లందరి సమక్షంలోనే గ్యాంగ్‌స్టర్‌-పొలిటీషియన్‌ అయిన అతిఖ్‌ అహ్మద్‌, అతని సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ను కాల్చి చంపేశారు ముగ్గురు. ఈ షాకింగ్‌ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యోగి సర్కార్‌పై పలువురు ప్రశంసలు గుప్పించగా.. లా అండ్‌ ఆర్డర్‌ గతి తప్పిందంటూ విమర్శించిన వాళ్లూ లేకపోలేదు. ఈ క్రమంలో ఈ జంట హత్యల ఉదంతంపై విచారణ కొనసాగుతోంది. 

గురువారం అతిఖ్‌ సోదరుల హత్య కేసు దర్యాప్తులో భాగంగా.. క్రైమ్‌ సీన్‌ రీక్రియేట్‌ చేసింది విచారణ కమిటీ. జ్యుడీషియల్‌ కమిటీ సమక్షంలోనే పోలీసులు గ్యాంగ్‌స్టర్‌ బ్రదర్స్‌ మర్డర్‌ ఎలా జరిగిందనే సీన్‌ను చూపించారు. ఇందులో పోలీస్‌ అధికారులు సైతం నటించారు. 

ప్రయాగ్‌రాజ్‌లోని కోల్విన్‌ ఆస్పత్రి బయట ఏప్రిల్‌ 15వ తేదీ రాత్రి వైద్య పరీక్షల కోసం పోలీసులు తీసుకెళ్తున్న అతిఖ్‌ను, అతని సోదరుడు అష్రాఫ్‌ను దారుణంగా కాల్చి చంపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం సోషల్‌ మీడియా, మీడియా ద్వారా వీక్షించారంతా. 

  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top