దేశంలో కరోనా యాక్టివ్‌ కేసులు 12.94 శాతం

70496 New Corona Positive Reported In India  - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటలలో 70,496 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 964 మంది మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 69,06,152గా ఉంది.

ఇక దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 8,93,592గా ఉండగా.. కరోనా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 59,06,070కు చేరింది. కోవిడ్‌ వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,06,490కు చేరింది. కరోనా బాధితుల రికవరీ రేటు 85.52 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసుల్లో మరణాల రేటు 1.54 శాతానికి తగ్గింది. మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 12.94  శాతంగా ఉన్నాయి. (ఏపీ: కరోనా తగ్గుముఖం పట్టింది..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top