భారత్లో 80 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 80 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 49,881 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,40,203కి చేరింది. నిన్న ఒక్క రోజే 517 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,20,527 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న 56,480 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 73,15,989 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,03,687గా ఉంది.