రాజధానిలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

1056 Corona Positive Cases In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గడచిన 24 గంటలలో  1056 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. 28 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య  1 లక్ష  32 వేలు దాటింది.  మృతుల సంఖ్య 3,881కి పెరిగింది. ఇప్పటివరకు చికిత్స పూర్తి చేసుకుని 1,17,507 మంది డిశ్చార్‌ అయ్యారు. ప్రస్తుతం 10,887 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఢిల్లీలో 9,76,827 పరీక్షలు నిర్వహించారు. మరోవైపు రికవరీ రేటు 88శాతానికి పెరగడం కొంత ఊరటనిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. (భారత్‌లో కొత్తగా 47,704 కేసులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top