
భక్తిశ్రద్ధలతో విశ్వకర్మ భగవాన్ వేడుకలు
మక్తల్: విరాట్ విశ్వకర్మ భగవానుడి జయంతిని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని స్థానిక నల్లజానమ్మ ఆలయం నుంచి శ్రీమోనేశ్వరస్వామి ఆలయం వరకు విశ్వకర్మ పల్లకీసేవను భజనలతో ఊరేగించారు. ఆలయం వద్ద హోమం నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పాలాభిషేకం చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. చిన్నారులు చేసిన దాండియా నృత్యాలు, భజనలు పలువురిని ఆకట్టుకున్నాయి. సాయిజ్యోతి పాఠశాల తరఫున 2024– 2025 విద్యా సంవత్సరంలో ప్రతిభ చూపిన విశ్వకర్మ విద్యార్థులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పోర్ల విశ్వనాథ్, పోర్ల రాఘవేందర్, విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు రాఘవేంద్రచారీ, ప్రధాన కార్యదర్శి గట్టురవి ఆచారీ, కోశాధికారులు కడ్మూర్ రాజు, వి.రాజు తదితరులు పాల్గొన్నారు.