వైభవంగా వీరభద్రస్వామి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా వీరభద్రస్వామి రథోత్సవం

Apr 3 2025 1:30 AM | Updated on Apr 3 2025 1:30 AM

వైభవంగా వీరభద్రస్వామి రథోత్సవం

వైభవంగా వీరభద్రస్వామి రథోత్సవం

మక్తల్‌: పట్టణంలోని వీరభద్రస్వామి ఆలయ ఉత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం అంగరంగా వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని రథంపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అటు నుంచి ఆలయం వరకు వేలాదిగా భక్తులు పాల్గొని రథాన్ని లాగారు.

ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు

నారాయణపేట ఎడ్యుకేషన్‌: పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం సాంఘికశాస్త్రం పరీక్ష జరిగింది. దీంతో మొత్తం పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 39 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా చివరి రోజు 7635 రెగ్యులర్‌ విద్యార్థులకుగాను 7617 మంది హాజరయ్యారు. 18 మంది గైర్వాజరయ్యారు. ప్రైవేట్‌ విభాగంలో మొత్తం నలుగురు విద్యార్థులకు ఇద్దరు హాజరయ్యారు. డీఈఓ గోవిందరాజులు, ఎనిమిది మంది స్టేట్‌ అబ్జర్వర్లు, ఆరు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా శిక్షపడేలా చూస్తాం

నాగర్‌కర్నూల్‌ క్రైం: ఉర్కొండ మండలం ఊర్కొండపేటలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా కఠిన శిక్షపడేలా చూస్తామని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సభ్యసమాజం తలదించుకునే విధంగా మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారని అన్నారు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి పలు సెక్షన్ల కేసులు నమోదు చేయడంతో పాటు రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలను ఎవరు సహకరించరని.. నిందితులను సమాజం బహిష్కరణ చేస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో భాగంగా జిల్లాలోని ప్రముఖ దేవాలయాలతో పాటు ట్యాంక్‌బండ్‌ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పోలీసు నిఘా, పహారా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement