కృష్ణమ్మా.. చల్లగా చూడమ్మా!
● సంప్రదాయబద్ధంగా కృష్ణమ్మ హారతి
కృష్ణవేణమ్మకు పూజలు నిర్వహిస్తున్న దేవస్థాన ఈఓ దంపతులు
కృష్ణానదికి హారతులు ఇస్తున్న అర్చకులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో కొనసాగుతున్న కార్తీక మాసోత్సవాల్లో భాగంగా రెండవ శుక్రవారం సాయంత్రం కృష్ణమ్మ హారతి కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అర్చకులు, వేదపండితులు కృష్ణవేణినదీమా తల్లికి పూజ లు చేసి, సారె సమర్పణ, దశ హారతులను వైభవంగా నిర్వహించారు. అలాగే పాతాళగంగ వద్ద ప్రతిష్టించిన కృష్ణవేణి విగ్రహానికి శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు. ఈ హారతి కార్యక్రమానికి ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. సంప్రదాయాన్ని అనుసరించి నదీమతల్లికి ఏకహారతి, నేత్రహారతి, బిల్వహారతి, నాగహారతి, పంచహారతి, సద్యోజాతాది పంచహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, రథహారతి, కర్పూరహారతులిచ్చారు. ఈ పూజా కార్యక్రమాల్లో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఏఈవో వెంకటేశ్వరరావు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణమ్మా.. చల్లగా చూడమ్మా!


