ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నాగర్కర్నూల్ క్రైం: స్థోమతలేని ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేయనున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సబిత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సబ్ జైలును తనిఖీ చేయడంతోపాటు జైలు ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె ఖైదీలకు ఉన్న హక్కులు, ఫ్రీ లీగల్ ఎయిడ్, పోక్సో యాక్టు, లీగల్ సర్వీసెస్ యాక్టులపై అవగాహన కల్పించారు. బెయిల్ పిటిషన్ కోసం న్యాయవాదులను నియమించుకునే స్థోమత లేని ఇద్దరు ఖైదీలకు న్యాయవాదిని ఏర్పాటు చేశారు. అంతకుముందు జైలులో ఖైదీలకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీయడంతోపాటు వంటశాలను పరిశీలించి నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కొల్లాపూర్ జూనియర్ ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి వెంకట సుహాస్, చీఫ్ లీగల్ హెడ్ కౌన్సిల్ మురళీధర్రావు, డిప్యూటీ లీగల్ హెడ్ కౌన్సిల్ శ్రీరామ్ ఆర్య తదితరులు ఉన్నారు.