ఫ్యామిలీతో కేరళలో అనసూయ షికార్లు

Viral Video: Anchor Anasuya Enjoying With Family In Kerala Trip - Sakshi

తెలుగు టాప్‌ యాంకర్స్‌లో ఒకరిగా వెలుగొందుతోంది అనసూయ భరద్వాజ్‌. బుల్లితెర, వెండితెర.. కాదేదీ వినోదాల వడ్డింపుకు అనర్హం అన్నట్లుగా రెండింటా సత్తా చాటుతోందీ నటి. సమయం దొరికినప్పుడల్లా సోషల్‌ మీడియాలోనూ అభిమానులను పలకరిస్తూ వీడియోలను షేర్‌ చేస్తుంది. తాజాగా కేరళలో పర్యటిస్తున్న అనసూయ అక్కడి అందాలను చూసి మైమరిచిపోతోంది. దేవుడి సొంత దేశంగా పేరొందిన ఆ రాష్ట్రంలో పరుచుకున్న ప్రకృతి పచ్చదనాన్ని ఫ్యామిలీతో కలిసి తనివితీరా ఆస్వాదిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

స్టార్‌ హీరోల సినిమాల కీలక పాత్రల్లో నటిస్తూనే, మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసులను దోచుకుంటోందీ రంగమ్మత్త. ఈ క్రమంలో తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ సేతుపతి సినిమాల్లో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఇక తాజాగా మలయాళంలో కూడా ఆమెకు ఓ సినిమా అవకాశం వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం ‘భీష్మ పర్వం’లో ఓ కీలక పాత్ర చేయనుందట. తెలుగులో థాంక్యూ బ్రదర్‌ సినిమా చేస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. అంతేకాకుండా మరో మూడు భాషల్లోనూ సినిమాలు చేస్తున్నట్లు అనసూయ ఇటీవలే వెల్లడించింది.

చదవండి: గంగవ్వ, ‘కన్ను గీటు భామ’ మూతి తిప్పుడు వీడియో వైరల్‌‌

తాగుతా, పొట్టను చూసి గర్వంగా ఫీల్‌ అవుతున్నా: అనసూయ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top