Vijay Devarakonda: ఏప్రీల్లో సెట్స్పైకి రానున్న విజయ్-పూరి మరో చిత్రం
‘లైగర్’ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘జనగణమన’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ పాన్ ఇండియన్ ఫిల్మ్ను నిర్మించనున్నారు. ‘జనగణమన’ స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే దాదాపు పూర్తయింది. కాకపోతే ప్రస్తుతం స్క్రిప్ట్కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట పూరి.
అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ఈ ఏప్రిల్లో స్టార్ట్ చేసేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోందని టాక్. ఈ మూవీకి సంబంధించిన మేజర్ షూటింగ్ అమెరికాలో జరుగుతుందట. ఏప్రిల్లో తొలి షెడ్యూల్ను హైదరాబాద్లో స్టార్ట్ చేసి అమెరికా వెళ్తారా? లేక ఫస్ట్ ఫారిన్ షూటింగ్ ప్లాన్ చేస్తారా? అనే విషయాలపై స్పష్టత రావాలి. కాగా ‘లైగర్’ చిత్రం ఈ ఏడాది ఆగస్టు25న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.